ఇంటర్ పరీక్ష రాస్తూ.. విద్యార్థి మృతి
నాలుగు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.
నాలుగు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. కాగా... ఓ ఇంటర్ విద్యార్థి పరీక్ష రాస్తూ.. ఎగ్జామ్ హాల్ లోనే కన్నుమూశాడు. ఈ విషాద సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.
శనివారం ఇంటర్ పరీక్ష రాస్తూ గోపిరాజ్ అనే విద్యార్థి మృతి చెందాడు. ప్యారడైజ్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఈ విషాదం నెలకొంది. విద్యార్థి గోపిరాజ్ పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే.. విద్యార్థి ఎలా మృతిచెందాడు అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.