ముగిసిన ఆరో విడత ఎన్నికల ప్రచారం: పోలింగ్ ఏర్పాట్లు పూర్తి
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గాను మే 12న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గాను మే 12న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ఆరో దశలో ఈ దశలో బిహార్లోని 8, దిల్లీలోని 7, హరియాణాలోని 10, ఝార్ఖండ్లోని 4, మధ్యప్రదేశ్లోని 8, ఉత్తర్ప్రదేశ్లోని 14, పశ్చిమ బెంగాల్లోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 424 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి.