Asianet News TeluguAsianet News Telugu

APPSC : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 16 వరకూ జరగనున్న పరీక్షలు. ఇటీవల హై కోర్టు తీర్పు ప్రకారం మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
 

APPSC group 1 mains schedule released
Author
Hyderabad, First Published Nov 13, 2019, 10:59 AM IST

అమరావతి : గ్రూప్‌-1 సర్వీసెస్‌ (నోటిఫికేషన్‌ నెం.27/2018) మెయిన్స్‌ పరీక్షలు 2020 ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఏడు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. 

ఫిబ్రవరి 4న తెలుగులో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 5న ఇంగ్లీషులో పేపర్‌(క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 7న పేపర్‌-1, 10న పేపర్‌-2, 12న పేపర్‌-3, 14న పేపర్‌-4, 16న పేపర్‌-5 పరీక్షలు జరుగుతాయి. 

 aslo read   పోస్టల్ డిపార్టుమెంట్ లో ఉద్యోగాలు...మరో 2 రోజులే గడువు

  • ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(నో. నెం.10/2018) మెయిన్స్‌ పరీక్షలు మార్చి 17 నుంచి 19వ తేదీ వరకు ఐదు సెషన్లలో జరుగుతాయి. 

 

  • డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(నో.నెం.20/2018) మెయిన్స్‌ పరీక్షలు మార్చి 19, 20 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహిస్తారు.పరిపాలనా పరమైన కారణాల వల్ల పరీక్షల షెడ్యూల్‌ను ఈ మేరకు మార్పులు చేసినట్లు ఏపీపీఎస్సీ సెక్రెటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

aslo read civil service jobs: సివిల్ సర్వీసెస్ 2019 నోటిఫికేషన్ విడుదల

అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌(నో.నెం.16/2018) పోస్టులకు ప్రొవిజినల్‌గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ నోటీసు బోర్డుతో పాటు https://psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios