Asianet News TeluguAsianet News Telugu

దక్షిణాఫ్రికాలో లోయలో పడిన బస్సు: 45 మంది మృతి


దక్షిణాఫ్రికాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు.ఈ  ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడ్డారు.

Bus falls off cliff killing 45 people in South Africa lns
Author
First Published Mar 29, 2024, 8:03 AM IST


జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో  గురువారం నాడు ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు.  ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు  లోయలో పడిపోయింది.ఈ ప్రమాదంలో  45 మంది మృతి చెందారు. బోట్సావానా నుండి మోరియాకు  బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని  రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయపటడింది. ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈశాన్య లింపోపో ఫ్రావిన్స్ లో  ఈ ఘటన చోటు చేసుకుంది. 

జోహాన్స్‌బర్గ్ కు ఉత్తరాన 300 కి.మీ. దూరంలోని  మోకోపానే, మార్కెన్ మధ్య  పర్వత మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ మార్గంలో వంతెన పై నుండి బస్సు లోయలో పడింది.  బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో  ప్రమాదం జరిగిందని రవాణాశాఖ అధికారులు ప్రకటించారు.165 లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోవడంతో  మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలిసిన వెంటనే  అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలాన్ని రవాణా శాఖ మంత్రి సింధిసివే  పరిశీలించారు.  ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios