Asianet News TeluguAsianet News Telugu

`కల్కి2898ఏడీ` సస్పెన్స్ పై స్పందించి టీమ్‌.. అప్‌ డేట్‌కి రెడీ.. కానీ అదే పెద్ద సస్పెన్స్..

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమాపై టీమ్‌ స్పందించింది. అప్‌ డేట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కానీ ఆ ఒక్కటి మాత్రం సస్పెన్స్ తోనే కొనసాగుతుంది. 
 

kalki 2898 ad amitabh bachchan role update but big suspense on release date arj
Author
First Published Apr 20, 2024, 8:52 PM IST

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమా కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు, సాధారణ సినీ లవర్స్ సైతం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. సినిమాకి సంబంధించిన అప్‌డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నారు. కానీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నుంచి గానీ, నిర్మాణ సంస్థ నుంచి గానీ ఎలాంటి రియాక్షన్‌ లేదు. ఆ మధ్య ప్రభాస్‌ పాత్రని వెల్లడించారు. ఆయన భైరవ పాత్రలో కనిపిస్తారని ఆ పాత్రని విడుదల చేశారు. కానీ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం గట్టిగా సాగుతుంది. కానీ టీమ్‌ రియాక్ట్ కాలేదు. ఓ ఇంటర్వ్యూలో నిర్మాత స్వప్న దత్‌.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బయ్యర్లు, పార్టనర్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా రిలీజ్‌ వాయిదా అన్నట్టుగా చెప్పారు. రిలీజ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో రిలీజ్‌ డేట్‌ క్లారిటీ వస్తుందన్నారు. కానీ టీమ్‌ రియాక్ట్ కాలేదు. తాజాగా ఎట్టకేలకు స్పందించింది యూనిట్‌. అప్‌డేట్‌కి సిద్ధమైంది. అయితే ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ పాత్రని రివీల్‌ చేయబోతున్నారు. ఆయన పోస్టర్‌ని పంచుకుని ఆయన ఎవరో తెలుసుకునే సమయం వచ్చిందని పేర్కొంది. 

రేపు సాయంత్రం 7.15గంటలకు అమితాబ్‌ బచ్చన్‌ పాత్రని రివీల్‌ చేస్తామని తెలిపింది. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌లో భాగంగా దీన్ని రివీల్‌ చేస్తామని, స్టార్‌ స్పోర్ట్స్ లో దీన్ని లైవ్‌లో చూడొచ్చని పేర్కొంది టీమ్‌. క్రికెట్‌ అభిమానుల మధ్య ఈ అప్‌డేట్‌ రాబోతుందని చెప్పొచ్చు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అసలు విషయమే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రని పరిచయం చేస్తామని తెలిపారు, కానీ రిలీజ్‌ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. అమితాబ్‌ పాత్ర పరిచయంతోనే రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తారా? లేక దానికి మరికొన్ని రోజులు ఊరిస్తారా? అనేది ఇప్పుడు మరింత సస్పెన్స్ గా మారింది. ఏం జరుగుతుందనేది తెలియాలంటే మరో 24 గంటలు వెయిట్‌ చేయాల్సిందే. 

ఇక ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిశా పటానీకి ప్రభాస్‌కి జోడీగా నటిస్తుంది. కమల్‌ హాసన్‌, విజయ్ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ వంటి భారీ కాస్టింగ్‌ గెస్ట్ రోల్స్ లో మెరబోతున్నారట. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మే 9న ఈ మూవీని రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నారట. మే 30గానీ, జూన్‌లోగానీ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. ఎప్పుడు రిలీజ్‌ చేసినా అత్యధిక భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios