Asianet News TeluguAsianet News Telugu

ఆశ్రమంలో చేరిన అనాథ బాలికపై స్వామీజీ పైశాచికత్వం.. రెండేళ్లుగా అత్యాచారం, చిత్రహింసలు...

తన ఆశ్రమంలో చేరిన అనాథ బాలికకు చిత్రహింసలు చూపించాడో స్వామీజీ. రెండేళ్లుగా ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. 

Swamiji raped minor girl for two years in andhrapradesh, arrested - bsb
Author
First Published Jun 20, 2023, 6:44 AM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ల లో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది.  తనపై ఓ స్వామీజీ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఆశ్రమంలో చేరిన ఓ అనాధ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో ఇప్పుడు విశాఖపట్నంలో ఆశ్రమం ఉన్న స్వామీజీ పేరు మారుమోగుతోంది. బాలిక ఫిర్యాదుపై వెంటనే పోలీసులు స్పందించి సోమవారం అర్ధరాత్రి స్వామీజీని అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని కొత్త వెంకోజీ పాలెం జ్ఞానానంద ఆశ్రమంలో ఈ దారుణం జరిగినట్లు తెలిసింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయిన ఓ బాలిక (15)ను బంధువులు పదవ తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరానికి చెందిన ఆ బాలికను రెండేళ్ల క్రితం విశాఖపట్నంలోని కొత్త వెంకోజి పాలెం దగ్గర ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో సేవల కోసం పంపించారు. జ్ఞానానంద ఆశ్రమంలో నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ. ఈ అమ్మాయిని ఆవులకు మేత వేయించడం, పేడతీయడం వంటి పనులకు నియమించాడు. 

తాడిపత్రిలో దారుణం... మందు తాగొద్దన్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు

ఆశ్రమంలో చేరిన కొద్ది రోజుల తర్వాత ఆ తర్వాత ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ తనతో పాటు గదిలోకి తీసుకెళ్లి పూర్ణానంద స్వామి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అతని పైశాచికత్వం పెరిగిపోయింది. ఆ అమ్మాయిని తన గదిలోనే కాళ్లకు గొలుసులు వేసి బంధించేవాడు.  ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఆహారం కూడా పెట్టకుండా వేధించేవాడు. రెండు చెంచాల అన్నాన్ని నీటితో కలిపి పెట్టేవాడు. కాల కృత్యాలకు అనుమతించేవారు కాదు. బకెట్ లోని  కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి. రెండు వారాలకు ఒకసారి స్నానం… ఇలా రెండేళ్లపాటు చిత్రహింసలు అనుభవించింది ఆ  అమ్మాయి.

ఈ చిత్రహింసల నడుమ ఆశ్రమం నుంచి..  జూన్ 13వ తేదీన  పనిమనిషి సహాయంతో ఎలాగో తప్పించుకుంది అమ్మాయి. అక్కడి నుంచి పారిపోయి.. తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కింది. ఆ రైలులో తనకు పరిచయమైన ఒకరికి బాధను చెప్పుకుంది. ఆ అమ్మాయి వ్యథార్థగాథకు కరిగిపోయిన ఆ మహిళ కృష్ణా జిల్లా కంకిపాడులోని హాస్టల్లో చేర్చాలని ప్రయత్నించింది. అయితే, హాస్టల్ నిర్వాహకులు.. అమ్మాయిని చేర్చుకోవాలంటే పోలీస్ స్టేషన్ నుంచి లెటర్ తీసుకురావాలని చెప్పారు.

దీంతో ఆ మహిళ రెండు రోజుల క్రితం కంకిపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. పోలీసులు లెటర్ ఇవ్వడంతో అది తీసుకుని బాలల సంక్షేమ కమిటీకి బాలికను తీసుకువెళ్లింది. అక్కడ వారి ముందు బాలిక ఆశ్రమంలో తాను అనుభవించిన నరకాన్ని వివరించింది. అది విన్న అక్కడున్న వారంతా  తీవ్రంగా కదిలిపోయారు. వెంటనే సిడబ్ల్యుసి సభ్యులు విజయవాడలోని దిశా పోలీస్ స్టేషన్ కు ఆ అమ్మాయిని పంపించారు. వారు.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. పూర్ణానంద స్వామీజీ మీద ఫోక్సో కేసు నమోదు చేశారు.

అప్పటికే తీవ్ర బలహీనంగా ఉన్న అమ్మాయిని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల కోసం పంపించారు. బాలిక ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు.  అయితే తమ ఆశ్రమంలో ఉండే ఓ బాలిక అదృశ్యమైందని ఈనెల 15వ తేదీన ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.  తాజా పరిణామాలు నేపథ్యంలో పూర్ణానంద స్వామీజీ.. ఆశ్రమ భూములు కొట్టేయాలని కొందరు చూస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగిందని వాపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios