Asianet News TeluguAsianet News Telugu

సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డుకు బాబు పిటిషన్: ఈ నెల 26కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

సీఐడీ అధికారుల కాల్ రికార్డ్స్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను  ఈ నెల  26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. 

ACB Court Adjourns Hearing Chandrababu Naidu seeking of AP CID Call Data lns
Author
First Published Oct 20, 2023, 2:17 PM IST

అమరావతి:  టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన  సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు పిటిషన్ పై విచారణ ఈ నెల  26కి వాయిదా  పడింది.  ఈ పిటిషన్ పై  విచారణ జరిగింది.చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పీపీని ఏసీబీ కోర్టు ఆదేశించింది.అయితే ఈ విషయంలో తమకు ఈ నెల  26వ తేదీ వరకు  సమయం కావాలని పీపీ ఏసీబీ కోర్టును కోరారు.పీపీ వినతి మేరకు ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల  26వ తేదీ వరకు  ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును  ఈ ఏడాది సెప్టెంబర్  9న  ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల  మొబైల్ కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు  తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.  ఈ ఏడాది సెప్టెంబర్ 11న  చంద్రబాబు తరపు న్యాయవాదులు   కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సవరించాలని  ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూచించారు.  ఆ తర్వాత పిటిషన్ ను సవరించి  ఏసీబీ కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల  18వ తేదీకి వాయిదా పడింది.

 ఏపీ ఫైబర్ నెట్ కేసు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లు  సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున సీఐడీ అధికారుల కాల్ డేటాపై  విచారణను ఈ నెల  20వ తేదీకి  ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇవాళ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్  ఏసీబీ కోర్టును కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో  విచారణను ఈ నెల  26వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

also read:బాబుకు షాక్:లీగల్ ములాఖత్ పెంచాలని దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నంద్యాలలో ఉన్న చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని  టీడీపీ ఆరోపిస్తుంది. ఈ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసు,అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో  పీటీ వారంట్లను ఏసీబీ కోర్టుల్లో సీఐడీ దాఖలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios