

చర్మ సంరక్షణ కోసం వేప, శనగపిండి, పసుపును శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇవి చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా.. ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి.
చర్మంపై మొటిమలు, మచ్చలు లేదా జిడ్డు సమస్య ఉంటే ఈ ఫేస్ ప్యాక్ మంచి పరిష్కారం. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

వేప పౌడర్ 1 టీస్పూన్, శనగపిండి 2 టీస్పూన్లు, పసుపు చిటికెడు, నీరు లేదా రోజ్ వాటర్
ముందుగా వేప పొడి, శనగపిండి, పసుపును ఒక గిన్నెలో వేయండి. నెమ్మదిగా నీళ్లు కలుపుతూ పేస్ట్ చేయండి. పేస్ట్ ఎక్కువ చిక్కగా లేదా పలుచగా ఉండకూడదు. మృదువుగా ఉండాలి.
ముందుగా ముఖాన్ని సాధారణ నీటితో కడిగి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు తయారుచేసిన ఫేస్ ప్యాక్ను ముఖం, మెడపై బాగా పట్టించండి. 15-20 నిమిషాలు ఆరనివ్వండి. చల్లటి నీటితో ముఖం కడగండి.
వేపలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి, ఇవి మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. శనగపిండి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, చనిపోయిన చర్మాన్ని తొలగించి ముఖానికి కాంతినిస్తుంది
పసుపు చర్మ ఇన్ఫెక్షన్, అలెర్జీల నుండి రక్షిస్తుంది. ఈ ప్యాక్ ను వారంలో 2-3 సార్లు వేసుకుంటే.. ముఖంపై అదనపు నూనె పోయి, చర్మం నిగనిగలాడుతుంది.