Telugu

ధోని బాటలోనే కోహ్లీ.. అభిమానుల కోసం బిగ్ డెసిషన్

Telugu

కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్

విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. అతడు కనీసం 2030 వరకు ఆర్సీబీ తరఫున ఆడటం దాదాపు ఖాయమైంది.

Image credits: ANI
Telugu

కోహ్లీ గురించి ఆర్సిబి సీఈఓ కీలక వ్యాఖ్యలు

"విరాట్ కోహ్లీ మరో 3 నుంచి 4 ఏళ్లపాటు కచ్చితంగా మైదానంలో ఉంటారు" అని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మేనన్ భరోసా ఇచ్చారు. అంటే ధోని మాదిరిగానే అతడి కెరీర్ మొత్తం ఆర్సిబితోనే సాగనుంది.

Image credits: ANI
Telugu

తరగని పరుగుల దాహం

36 ఏళ్ల వయసులోనూ కోహ్లీ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. పరుగుల పట్ల అతని ఆకలి, ఆట పట్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.

Image credits: X@ipl
Telugu

ఐపీఎల్‌లో రన్ మెషీన్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు (9,336) చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతను ఆర్సీబీకి అసలైన బ్రాండ్ అంబాసిడర్.

Image credits: IPL MEDIA
Telugu

ఆర్సిబి ఐపిఎల్ ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర

2025లో 657 పరుగులు సాధించి, ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.

Image credits: ANI
Telugu

ఒకే నాణేనికి రెండు ముఖాలు

ఆర్సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు ముఖాలు లాంటి వాళ్లు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతను ఆర్సీబీ కుటుంబంలోనే కొనసాగుతాడు.

Image credits: ANI

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ టాప్ 7 రికార్డులివే...

Virat Kohli Net Worth : క్రికెటర్ గా కోహ్లీ శాలరీ ఎంత? నెట్ వర్త్ ఎంత?

Sanjana Ganesan: బుమ్రా భార్య సంజనా గణేశన్ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆస్తి ఎంతో తెలుసా?