స్నేహితులు, భాగస్వాములు మోసం చేస్తే బాధ కలుగుతుంది. కానీ చాణక్య నీతి ద్వారా మనసు చదవడం నేర్చుకుని మోసగాళ్లనుండి తప్పించుకోవచ్చు.
ఒకరి నిజస్వభావం వారి మాటల్లో కాదు, చేష్టల్లో ఉంటుంది. మాటల్ని పక్కనబెట్టి, పనులు గమనించండి. మాట తప్పేవారిని నమ్మకండి.
కళ్ళు ఆత్మకు అద్దం అంటారు. కళ్ళను చూసి అబద్ధమా, నిజమా అని తెలుసుకోవచ్చు. నిజాయితీపరుల కళ్ళు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. మోసగాళ్ళ కళ్ళు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి.
బలహీనులతో దురుసుగా, బలవంతులతో మర్యాదగా ప్రవర్తించేవారిని నమ్మకూడదు అని చాణక్యుడు చెప్పారు.
ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేసి నవ్వుకునే వ్యక్తి అహంకారి, అభద్రతా భావం కలవాడు. అలాంటి వారిని నమ్మకూడదు.
తక్కువ మాట్లాడి, ఎక్కువగా గమనించాలి. అప్పుడు ఇతరుల రహస్యాలను మనం తెలుసుకోవచ్చు.
ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం కొందరికి సరదాగా అనిపించవచ్చు, కానీ అది ప్రమాదకరం. మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు, మీ వెనుక కూడా అలాగే మాట్లాడతారు. వారికి దూరంగా ఉండండి.
ప్రజల మనసు చదవడం ఒక గొప్ప శక్తి. కానీ ఈ జ్ఞానాన్ని ఇతరులను బాధించడానికి కాదు, స్వీయ రక్షణ కోసం వాడాలని చాణక్య హెచ్చరించారు.