వర్షాకాలంలో పిల్లలకు రోగాలు సోకే అవకాశం ఎక్కువ. కాబట్టి పిల్లల దుస్తులు, ఆహారం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.
వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే శుభ్రత ముఖ్యం. సబ్బు, నీళ్ళతో చేతులు కడుక్కోవాలి.
పండ్లు, కూరగాయలు తినడం ద్వారా పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచవచ్చు. విటమిన్ సి, ఏ, డి, జింక్ వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
జలుబు రాకుండా ఉండటానికి ఎక్కువగా విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ, నారింజ తినాలి. సూప్ కూడా మంచిది.
వర్షాకాలంలో పిల్లలకు కాచిన నీళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఇలా చేస్తే.. కలరా, టైఫాయిడ్ రోగాలకు చెక్ పెట్టవచ్చు.
వర్షాకాలంలో పిల్లలకు కాటన్ బట్టలు వేయాలి. స్కూల్ కి వెళ్ళేటప్పుడు గొడుగు, రెయిన్ కోట్ ఇవ్వాలి.
వర్షాకాలంలో బయట తిండి తినడం మంచిది కాదు. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు పెరిగి, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంది.
వర్షం నీళ్ళు నిలిచి ఉన్న చోట ఆడుకోనివ్వకండి. రోగాలు రావచ్చు.