మారిన జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల కిడ్నీ సంబంధిత సమస్యలతో బారినపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.
కిడ్నీల పనితీరు దెబ్బతింటున్న విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. ముఖ్యంగా నీరు తాగిన వెంటనే కనిపించే లక్షణాలు దీనికి సంకేతంగా చెప్పొచ్చు.
నీరు తాగిన వెంటనే కిడ్నీలు ఉండే ప్రదేశంలో నొప్పిగా అనిపించినా, సూదితో గుచ్చినట్లు అనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి. వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్సలు చేయించుకోవాలి.
నీరు తాగగానే అకస్మాత్తుగా అలసట, నీరసంగా అనిపించినా మూత్రపిండాల దెబ్బతినడానికి సంకేతంగా భావించాలి. నీరు తాగిన వెంటనే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి రాడమే దీనికి కారణం.
నీరు ఎంత తాగినా మూత్రం తక్కువగా వస్తుందంటే కిడ్నీల ఆరోగ్యం గురించి దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలు నీటిని సరిగ్గా ఫిల్టర్ చేయని సమయంలో ఇలాంటి సమస్యలు వస్తాయి.
నిత్యం వికారంగా అనిపిస్తున్నా, నీరు తాగిన వెంటనే కడుపులో ఏదో అసౌకర్యంగా ఉన్నా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటే అస్సలు లైట్ తీసుకోకూడదు. ఇది కూడా మూత్రి పిండాలు దెబ్బతింటున్నాయని చెప్పేందుకు సంకేతంగా భావించాలి.
ఈ వివరాలన్నీ కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.