నీళ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే డాక్టర్లు నీళ్లను పుష్కలంగా తాగాలని సలహానిస్తుంటారు. అయితే ఉదయం లేవగానే అంటే పళ్లు తోముకోవడానికి ముందే నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?
Image credits: our own
Telugu
పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగితే
నైట్ నిద్రవల్ల మన శరీరంలో నీరు తగ్గుతుంది. అందుకే ఉదయం లేవగానే నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం హైడ్రేట్ అయ్యి హెల్తీగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
Image credits: our own
Telugu
బాక్టీరియాను తొలగిస్తుంది
మన లాలాజలంలో ఉండే సహజ ఎంజైమ్లు చెడు బాక్టీరియాను తొలగించడానికి సహాయపడతాయి. పరిగడుపున నీళ్లను తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Image credits: our own
Telugu
ఆయుర్వేద ప్రాముఖ్యత
ఉదయాన్నే పరిగడుపున నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం కూడా చెబుతోంది. రోజూ ఇలాగే నీళ్లు తాగితే మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
కడుపుని శుభ్రపరుస్తుంది
ఉదయాన్నే నీళ్లను తాగితే పేగులు శుభ్రపడతాయి. మలబద్దకం సమస్య ఉండదు. జీవక్రియ పెరుగుతుంది. శరీరం చురుగ్గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది.
Image credits: our own
Telugu
తలనొప్పి తగ్గుతుంది
పళ్లు తోముకోవడానికి ముందు నీళ్లను తాగితే మైగ్రేన్, తలనొప్పి కూడా తగ్గుతాయి. పరిగడుపున నీళ్లను తాగితే బరువు కూడా తగ్గుతుంది. ఎలా అంటే ఇది ఆకలిని తగ్గించి అతిగా తినకుండా చేస్తుంది.