చెక్కలో చెద చేరడానికి ప్రధాన కారణం తేమ. తేమ ఉన్న చెక్కల్లోనే ఈ పురుగులు ఎక్కువ పెరుగుతాయి.
తలుపులు, షెల్ఫ్ వంటి ఫర్నీచర్ చేయించేటప్పుడే పాలిష్ చేయిస్తే చెద రాకుండా ఉంటుంది.
చెద పురుగులు ఫర్నీచర్కు నష్టం కలిగిస్తాయి. అందువల్ల ఎప్పటికప్పుడు తలుపులు, కిటికీలను చెక్ చేస్తూ ఉండాలి.
ఎల్లప్పుడూ సూర్యకాంతి వచ్చేలా ఫర్నీచర్ను ఉంచితే చెద వంటి కీటకాలు రాకుండా ఆపవచ్చు.
ఫర్నీచర్లో చెద ఉంటే వెంటనే ఎండలో పెట్టండి. కనీసం 4 రోజులైనా ఎండలో ఉంచితే పురుగులు చనిపోవడమే కాకుండా, మళ్లీ రావు.
ఇంట్లో చెత్తను పోగు చేసి వదిలేస్తే చెద పురుగులు రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
పాలిష్ చేయకుండానే చెదను తరిమికొట్టవచ్చు. వేప నూనెను ఒక సీసాలోకి తీసుకుని పురుగులు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే సరిపోతుంది.