నిలబడి నీరు తాగడం వల్ల నీరు నేరుగా కడుపు, పేగులకు చేరుతుంది, కానీ కీళ్లపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు.
కూర్చొని నెమ్మదిగా నీరు తాగితే కీళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మోకాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.
రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు అవసరం. కానీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
తినే ముందు అరగంట, తిన్న తర్వాత అరగంట నీరు తాగడం చాలా మంచిది.
తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అంటే, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, వాయువు, అజీర్తి వంటి సమస్యలను కలిగిస్తుంది.