వేసవికాలంలో పాదాల చర్మం తేమ లేకపోతే పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
వేసవిలో చెప్పులు లేకుండా నడిస్తే పాదాలకు దుమ్ము, ధూళి పేరుకుపోయి పగుళ్లు వస్తాయి.
పాదాల చెమట వల్ల దుమ్ము పేరుకుపోయి పగుళ్లు ఏర్పడుతాయి..
వేసవిలో విటమిన్ సి, విటమిన్ ఇ ల లోపం వల్ల పాదాలు పగులుతాయి.
సరైన సైజు పుట్ వేర్ వేసుకోకపోతే చెమట, దుమ్ము పేరుకుపోయి పగుళ్లు వస్తాయి.
వేసవిలో తక్కువ నీరు తాగితే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీనివల్ల పాదాలు పగులుతాయి.
మడమపై ఎక్కువ ఒత్తిడి పడితే పగుళ్లు ఏర్పడే అవకాశముంది.