gardening
సాయంత్రం వేళ పూలు, ఆకులు విశ్రాంతి తీసుకునే సమయం. కాబట్టి వాటిని కోయడం పాపమని హిందూ ధర్మం చెబుతోంది.
సాయంత్రం పక్షులు, కీటకాలు గూళ్ళకి చేరుకుంటాయి. ఈ సమయంలో పూలు, ఆకులు కోయడం వల్ల చెట్లు కదిలి అవి కంగారు పడతాయి. వాటిని ఇబ్బంది పెట్టడం సరికాదు.
మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం వేళ దేవతలు చెట్లు, మొక్కలపై ఉంటారు. కాబట్టి వాటిని కోయడం అశుభమని పండితులు చెబుతున్నారు.
సూర్యాస్తమయం తర్వాత పూలు, ఆకులు కోస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట.
హిందూ మతంలో ఉదయం దేవుడికి పూజ చేస్తారు. ఆ సమయంలో పూలు, పత్రి కోయడం శుభప్రదం.
సాయంత్రం తర్వాత మొక్కలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. అది ఆరోగ్యానికి హానికరం. అందుకే వాటి దగ్గరకు వెళ్లకూడదు.