చాణక్య నీతి ప్రకారం శాఖాహారం తింటే ఎక్కువ శక్తి లభిస్తుందా? మాంసాహారం తింటే ఎక్కువ శక్తి లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Telugu
చాణక్య నీతి
చాణక్య నీతి ప్రకారం.. మన శరీరానికి పిండి పదార్థాలు, ధాన్యాలు ఎంతో మంచివి. అయితే ఈ ధాన్యాల కన్నా పాలు మంచివి. ఈ పాల కన్నా మాంసం, మాంసం కన్నా నెయ్యి మనకు ఎక్కువ శక్తినిస్తుంది.
Telugu
ధాన్యాలు, పిండిలో శక్తి
చాణక్య నీతి ప్రకారం.. ధాన్యాలు మనకు చాలా శక్తినిస్తాయి. అందుకే వీటిని తినాలని చెప్తారు. అయితే ఈ ధాన్యాల కన్నా పిండిపదార్థాలు మనకు పదిరెట్లు ఎక్కువ బలాన్నిస్తాయి.
Telugu
పాలలో ఎక్కువ శక్తి
ఆచార్య చాణక్యుడి ప్రకారం..ధాన్యాల్లో కంటే పాలలోనే శక్తి ఎక్కువగా ఉంటుంది. బర్రె పాల కంటే ఆవుపాలే మంచివి. ఎందుకంటే ఇవి తేలికగా జీర్ణమవుతాయి.
Telugu
మాంసంతో ఎక్కువ బలం
చాణక్య నీతి ప్రకారం.. పాలలో కంటే మాంసాహారంతోనే మనకు ఎనిమిది రెట్లు ఎక్కువ బలం లభిస్తుంది. కానీ ఎలాంటి కారణం లేకుండా జీవహింస చేయడం మహాపాపం. అందుకే మాంసాహారం తినకూడదంటారు.
Telugu
నెయ్యితో ఎక్కువ బలం
చాణక్య నీతి ప్రకారం.. నాన్ వెజ్ లో కంటే పదిరెట్లు ఎక్కువ శక్తి ఆవు నెయ్యితోనే అందుతుంది. ఎందుకంటే నెయ్యిలో ఎన్నో పోషకాలుంటాయి. ఇది మనల్ని బలంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.