భారత్లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్, ఆసియాలోనే తొలి మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయో తెలుసా..? ఆ రెండూ ఒకే రాష్ట్రంలో ఉన్నాయి.
కొన్ని రిపోర్టుల ప్రకారం.. పోర్చుగీసు పాలనలోనే ఇండియాలో మొదటి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. 18వ శతాబ్దంలో గోవాలో దీన్ని స్థాపించారు. ఇది ఆసియాలోని అత్యంత పురాతన వైద్య కళాశాల.
భారత్లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను కూడా గోవాలోని సెయింట్ పాల్ కాలేజీలోనే ఏర్పాటు చేశారు. ఇది 1556లో పనిచేయడం ప్రారంభించింది.
ఇందులో విశేషం ఏంటంటే ఇది కేవలం భారతదేశంలోనే కాదు మొత్తం ఆసియాలోనే మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్.
భారత్కు బ్రిటిషర్లు రాకముందే పోర్చుగీసు వారు గోవాకు వచ్చారు. బ్రిటిష్ వారు భారత్ను విడిచి వెళ్లాక కూడా వారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఎక్కువకాలం యూరోపియన్ల పాలనలో ఉన్న రాష్ట్రమిదే.
గోవా కేవలం బీచ్లకు మాత్రమే కాదు పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవులకు కూడా ప్రసిద్ధి. ఇక్కడి 'దూద్సాగర్ జలపాతం' దేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటిగా నిలుస్తుంది.