అత్యధిక ముస్లింలున్న దేశాల్లో ఇండియాది మూడో స్థానం.. మరి టాప్1 దేశం?
feature Jul 16 2026
Author: Arun Kumar P Image Credits:pexels
Telugu
ప్రపంచంలో ఇస్లాం.. రెండో అతిపెద్ద మతం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ఇస్లాంను అనుసరిస్తున్నారు. దీంతో క్రైస్తవం తర్వాత ఇస్లాం ప్రపంచంలో రెండో అతిపెద్ద మతంగా ఉంది.
Image credits: pexels
Telugu
ముస్లిం జనాభాలో పాక్ టాప్
ప్రస్తుత గణాంకాల ప్రకారం, పాకిస్థాన్లో అత్యధికంగా 24.08 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. దీంతో ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
Image credits: pexels
Telugu
రెండో స్థానంలో ఇండోనేషియా
గతంలో మొదటి స్థానంలో ఉన్న ఇండోనేషియా ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. ఇక్కడ 23.6 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు.
Image credits: pexels
Telugu
మూడో స్థానంలో భారత్
మన దేశమైన భారత్లో సుమారు 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
Image credits: AI meta
Telugu
భారత్ మరో రికార్డు
ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం మైనారిటీ జనాభా ఉన్న దేశం భారత్. అంటే ముస్లింలు మెజారిటీగా లేని దేశాల్లో, అత్యధిక ముస్లిం జనాభా ఉన్నది మన దేశంలోనే.
Image credits: AI meta
Telugu
ఆసియా-పసిఫిక్లోనే అధికం
ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభాలో దాదాపు 62 శాతం మంది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఇండోనేషియా, పాకిస్థాన్, భారత్ వంటి దేశాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
Image credits: AI meta
Telugu
అరబ్ దేశాల్లో టాప్ ఈజిప్ట్
అరబ్ దేశాల విషయానికొస్తే ఈజిప్ట్లో అత్యధిక ముస్లిం జనాభా ఉంది. ఇక్కడ సుమారు 9 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు.
Image credits: AI meta
Telugu
భవిష్యత్తులో భారత్ టాప్?
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించవచ్చని అంచనా వేస్తున్నారు.