1999లో, అమితాబ్ బచ్చన్ కంపెనీ ABCL నష్టాల్లోకి వెళ్ళడంతో ఆయన దివాళా తీశారు. ఆయన సినిమాలు కూడా బాగా ఆడలేదు.
దివాళా తీసినప్పటికీ, అమితాబ్ బచ్చన్.. యష్ చోప్రా పై అభిమానం, ఆయన తనకు అందించిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 1 రూపాయికే సినిమా చేశాడు.
దర్శకుడు నిఖిల్ అద్వానీ, ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్, యష్ చోప్రాల సంబంధం గురించి చర్చించి, వారిద్దరి సినిమాల గురించి ప్రస్తావించారు.
'సిల్సిలా' సమయంలో, యష్ చోప్రా అమితాబ్ను ఆయన పారితోషికం గురించి అడిగారు. 'నేను ఇల్లు కొనాలి, కాబట్టి ఈసారి మంచి మొత్తం కావాలి' అని ఆయన బదులిచ్చారు.
'మొహబ్బతీన్' సమయంలో, యష్ జీ పారితోషికం గురించి అడిగినప్పుడు, బిగ్ బి, 'అప్పుడు నేను అడిగింది ఇచ్చారు. ఇప్పుడు ఒక్క రూపాయికే చేస్తా' అన్నారు. నిజంగానే చేశారు` అని నిఖిల్ చెప్పారు.
2000లో విడుదలైన 'మొహబ్బతీన్' బ్లాక్ బస్టర్. ఇది భారతదేశంలో రూ. 41.88 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 76.91 కోట్లు వసూలు చేసింది.