ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అన్ని జట్లు దాదాపుగా తమ గ్రూప్ దశ మ్యాచ్లను ముగించడానికి చేరువగా ఉన్నాయి.
ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు పవర్ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన 6 బౌలర్ల ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, జీటీ ప్లేయర్ సిరాజ్ సమంగా 9 వికెట్లు తీసి టాప్ లో ఉన్నారు.
రెండవ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు పవర్ప్లేలో 8 వికెట్లు తీశాడు.
3వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఉన్నాడు. మొదటి 6 ఓవర్లలో మొత్తం 7 వికెట్లు తీసుకున్నాడు.
4వ స్థానంలో ముంబై ఇండియన్స్కు చెందిన దీపక్ చాహర్ ఉన్నాడు. పవర్ప్లేలో మొత్తం 7 వికెట్లు తీశాడు.
ఈ జాబితాలో 5వ స్థానంలో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. కమిన్స్ ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్లో పవర్ప్లేలో మొత్తం 7 వికెట్లు తీశాడు.