ఫోన్ లో ఉండే బ్లూ లైట్ ఎఫెక్ట్ వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. పడుకోవడానికి గంట ముందు ఫోన్ చూడటం ఆపేస్తే మీకు గాఢ నిద్రపడుతుంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో మునిగిపోయి ఉండటం వల్ల మీ పనులన్నీ పెండింగ్ పడిపోతాయి. వాటిని పక్కన పెడితే పనులపై శ్రద్ధ పెరుగుతుంది.
డిజిటల్ పరికరాలకు కాస్త దూరంగా ఉంటే మీ బంధువులతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అందరితో టైమ్ స్పెండ్ చేయొచ్చు. బంధాలు బలపడతాయి.
సోషల్ మీడియా, వార్తల నుండి దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది.
డిజిటల్ స్క్రీన్లకు దూరంగా ఉంటే మీరు మీ అభిరుచిపై దృష్టి పెట్టడానికి టైమ్ దొరుకుతుంది. అంటే వ్యాయామం, నడక, సంగీతం, డాన్స్ లాంటివి చేయొచ్చు.
సోషల్ మీడియా, వార్తల వల్ల మనసులో ఆందోళన పెరుగుతుంది. మనకు కూడా అలాగే జరుగుతుందా అన్న భయం కలుగుతుంది. వాటికి దూరంగా ఉంటే భయం పోతుంది.
డిజిటల్ స్క్రీన్స్ కి అతుక్కుపోవడం మానేసి పుస్తకాలు చదవండి. సంగీతం వినండి. ప్రకృతిలో కాసేపు టైమ్ గడపండి. ఆరోగ్యానికి మంచిది.