Asianet News TeluguAsianet News Telugu

కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఎక్కువ ఛానెల్‌లు

ట్రాయ్ గరిష్ట ఎన్‌సిఎఫ్ ఛార్జీని తగ్గించింది.అయితే 200 ఛానెల్‌లకు రూ. 130 (పన్నులు మినహాయించి)చెల్లించాలి.కొత్త నిబంధనలు  కేబుల్ టివి ప్రసార  సేవల కోసం రెగ్యులేటర్ 2017 టారిఫ్ ఆర్డర్‌లో చేసిన మార్పులలో భాగమని తెలిపింది. ఇవి మార్చి 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి.

trai revised cable and dth tariffs framework
Author
Hyderabad, First Published Jan 2, 2020, 5:49 PM IST

కేబుల్ టీవీ వినియోగదారుల ప్రయోజనాలను పెంచే ప్రయత్నంలో, ట్రాయ్ బుధవారం కేబుల్  ప్రసార సేవల కోసం కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో సవరణలు చేసింది. దీని కింద కేబుల్ టివి వినియోగదారులు తక్కువ ధరకే  ఎక్కువ ఛానెల్‌లను యాక్సెస్ చేయగలుగుతారు.


 టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రూ. 160 వినియోగదారులు నెలవారీగా ఎయిర్ ఛానెళ్లకు ఉచితంగా చెల్లించాలి. ఒక వ్యక్తి పేరిట ఒకటి కంటే ఎక్కువ టీవీ కనెక్షన్స్ పనిచేస్తున్న అదనపు టీవీ కనెక్షన్లు విషయంలో నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సిఎఫ్) లో గరిష్టంగా 40 శాతం వసూలు చేయాలని నిర్ణయించినట్లు ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. 

also read ఎయిర్‌టెల్ నుండి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫ్లాన్లు

వివిధ నిబంధనలను పరిశీలించిన తరువాత ట్రాయ్ 200 ఛానెళ్లకు గరిష్టంగా ఎన్‌సిఎఫ్ ఛార్జీని 130 రూపాయలకు (పన్నులు మినహాయించి) తగ్గించింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తప్పనిసరి అని చెప్పిన ఛానెల్‌లను ఎన్‌సిఎఫ్‌లోని ఛానెళ్లలో లెక్కించరాదని నిర్ణయించారు.

trai revised cable and dth tariffs framework

ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న దీర్ఘకాలిక సబ్స్క్రిప్షన్ పై డిస్కౌంట్ ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫాం ఆపరేటర్లకు (డిపిఓ) అథారిటీ అనుమతి ఇచ్చింది. ట్రాయ్ నిర్ణయం ప్రకారం రూ. 12 లేదా అంతకంటే తక్కువ ఎంఆర్‌పి ఉన్న ఛానెల్‌లు మాత్రమే బొకెట్ భాగం కావడానికి  బ్రాడ్ క్యాస్టర్స్  అనుమతి ఇచ్చింది.

also read గాడ్జెట్స్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తున్న రియల్ మీ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్

డిపిఓలు భారీ క్యారేజ్ ఫీజు వసూలు చేయడం గురించి బ్రాడ్ క్యాస్టర్స్ ఆందోళనను కూడా పరిశీలిస్తున్నట్లు రెగ్యులేటర్ తెలిపింది. టీవీ ఛానెళ్లను ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ (ఇపిజి) లో ఉంచడానికి డిపిఓలకు మరింత సౌలభ్యాన్ని ఇవ్వడానికి అథారిటీ పరిగణిస్తుంది. 

ఇటువంటి ఇపిజి లేఅవుట్‌ను తప్పనిసరిగా ట్రాయ్‌కు నివేదించాలి అలాగే అథారిటీ  ముందస్తు అనుమతి లేకుండా ఇందులో ఎటువంటి మార్పు చేయలేమని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త నిబంధనలు  కేబుల్ టివి ప్రసార  సేవల కోసం రెగ్యులేటర్ 2017 టారిఫ్ ఆర్డర్‌లో చేసిన మార్పులలో భాగమని తెలిపింది. ఇవి మార్చి 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios