రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్మెంట్ తర్వాత, సెలెక్టర్లు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కొత్త కెప్టెన్ను కనుగొనే పనిలో ఉన్నారు.
పలు నివేదికల ప్రకారం, శుభ్మన్ గిల్ టెస్ట్ క్రికెట్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి ముందంజలో ఉన్నారు.
ఇంగ్లాండ్ పర్యటన జట్టుతో మే నాలుగో వారంలో కొత్త టెస్ట్ కెప్టెన్ను ప్రకటించే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ టెస్టుల్లో భారత్కు నాయకత్వం వహించడానికి 7 కారణాలు ఇప్పుడు చూద్దాం.
రోహిత్, కోహ్లీ తమ కెరీర్ చరమాంకంలో ఉన్నందున, గిల్ స్థిరమైన ప్రదర్శనలు, పెరుగుతున్న పరిణతి దృష్ట్యా భారత క్రికెట్ తదుపరి ముఖంగా మారే అవకాశం ఉంది.
శుభ్మన్ గిల్ వయస్సు కేవలం 25 సంవత్సరాలు కాబట్టి, అతను దీర్ఘకాల కెప్టెన్సీ కోసం సిద్ధం కావడానికి ఇది సరైన సమయం.
శుభ్మన్ గిల్ మూడు ఫార్మాట్లలో క్రమం తప్పకుండా ఉండే కొద్దిమంది భారతీయ ఆటగాళ్లలో ఒకరు.
దేశవాళీ క్రికెట్లో పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరించిన శుభ్మన్ గిల్, ప్రస్తుతం ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్కు నాయకత్వం వహిస్తున్నారు.
ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో శుభ్మన్ గిల్ తన ప్రశాంతతను ప్రదర్శించడంతో పాటు వ్యక్తిగతంగా మంచి ఇన్నింగ్స్ లను ఆడతాడు.
శుభ్మన్ గిల్ ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. కాబట్టి కెప్టెన్ గా అతను భారత్ కు మంచి ఎంపిక.
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ జట్టులో యువ కోర్తో, శుభ్మన్ గిల్ నాయకత్వం ప్యూచర్ లో భారత్ కు సానుకూల ఫలితాలు అందించవచ్చు.