Budget 2024: 'గేమ్-ఛేంజర్' ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ క‌థేంటో తెలుసా?

Published : Feb 01, 2024, 01:17 PM IST
Budget 2024: 'గేమ్-ఛేంజర్' ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ క‌థేంటో తెలుసా?

సారాంశం

India Budget 2024-25: అంత‌ర్జాతీయంగా స‌త్తా చాటుతూ భార‌త్ ప్ర‌పంచ శ‌క్తిగా ఎదుగుతోంది. బ‌డ్జెట్ 2024 ప్ర‌సంగంలో ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మరి భార‌త్ విష‌యంలో ఇది ఎలా 'గేమ్-ఛేంజర్' కాబోతోంది?  

India-Middle East-Europe Economic Corridor: గతేడాది జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ట్రేడ్ కారిడార్ భారతదేశంతో పాటు మిగిలిన ప్రపంచానికి గేమ్ ఛేంజర్ అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై అందరికీ తమ శక్తి సామర్థ్యాలను చేరుకునే అవకాశాన్ని కల్పించడం విక్షిత్ భారత్ తమ లక్ష్యమని నిర్మ‌ల‌మ్మ పేర్కొన్నారు.

భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్

భారత్, యూఏఈ, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అమెరికాలతో కూడిన ఈ ఎకనామిక్ కారిడార్ పై 2023 సెప్టెంబర్ లో ఆయా దేశాలు సంత‌కాలు చేశాయి, దీనిని త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామని అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. భవిష్యత్తులో భారత్, పశ్చిమాసియా, ఐరోపా దేశాల మధ్య ఆర్థిక సమగ్రతకు ఈ కార్యక్రమం ప్రధాన మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కారిడార్ ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధికి కొత్త దిశను అందిస్తుందని భావిస్తున్నారు.

LPG price hike: బడ్జెట్ రోజున షాక్..పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

ఈ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది?

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు జీ7 దేశాలు సంయుక్తంగా చేపట్టిన పార్టనర్ షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ (పీజీఐఐ)లో భాగంగా ఈ రైల్ అండ్ షిప్పింగ్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు ప్రతిస్పందనగా దీన్ని భావిస్తున్నారు. ఇంధన ఉత్పత్తులపై దృష్టి సారించి, భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, చైనా విస్తృతమైన మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని ఎదుర్కోవటానికి ఇది మరింత ప్రతిష్టాత్మకమైన ప్రయత్నాలలో ఒకటిగా పరిగణించబడుతుందని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.

భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది.. ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్

ఈ కారిడార్ లో రైల్వే లింక్స్, విద్యుత్ కేబుల్, హైడ్రోజన్ పైప్లైన్, హైస్పీడ్ డేటా కేబుల్ తో సహా సమగ్ర మౌలిక సదుపాయాల నెట్ వ‌ర్క్ ఉంటుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ ప్రాజెక్టును వివిధ ఖండాలు, నాగరికతల మధ్య హరిత-డిజిటల్ వార‌ధిగా పేర్కొన్నారు. అయితే, ఈ కారిడార్ ను ప్రతిపాదించడానికి మూడు ప్రధాన కారణాలు చూడ‌వ‌చ్చు.  వాటిలో మొదటిది, ఇంధన ప్రవాహం, డిజిటల్ కమ్యూనికేషన్ల ప్రవాహాన్ని పెంచడం ద్వారా భాగస్వామ్య దేశాల మధ్య శ్రేయస్సును పెంచుతుందని భావిస్తున్నారు. రెండవది, తక్కువ-మధ్య ఆదాయ దేశాలలో వృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కొరతను పరిష్కరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. చివరగా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు-అభద్రతను తగ్గించడానికి ఈ కారిడార్ దోహదం చేస్తుందనీ, ఈ ప్రాంతానికి సంభావ్య స్థిరీకరణ కారకాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

కాగా, రెండు భాగాలుగా భావిస్తున్న దీనిలో మొదటిది ఈస్ట్ కారిడార్, ఇది భారతదేశాన్ని అరేబియా గల్ఫ్‌తో కలుపుతుంది. రెండవది ఉత్తర కారిడార్, ఇది గల్ఫ్‌ను యూరప్‌కు కలుపుతుంది. ఐఎంఈసీ ప్రణాళికలో విద్యుత్ కేబుల్, హైడ్రోజన్ పైప్‌లైన్, హై-స్పీడ్ డేటా కేబుల్‌ను రూపొందించడం కూడా ఉంది. దీనిపై సంత‌కం చేసిన దేశాల్లో యూనైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, యూఏఈ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలు ఉన్నాయి. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్, అదే రాష్ట్రంలోని కాండ్లా పోర్ట్, నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ కారిడార్‌కు అనుసంధానించబడే భారతీయ ఓడరేవులుగా ఉన్నాయి.

Petrol Diesel Price: బడ్జెట్ 2024-25 వేళ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా