జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ కలర్ పర్సులు మంచివి? ఏవి మన సంపదను పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జ్యోతిష్యం ప్రకారం.. గ్రీన్ కలర్ పర్సు శ్రేయస్సు, మన ఎదుగుదలను సూచిస్తుంది. ఈ కలర్ పర్సును వాడితే సంపద పెరుగుతుందట.
పసుపు రంగు శ్రీమహావిష్ణువుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ పర్సును వాడితే మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే మీకు అన్నీ శుభాలే కలుగుతాయి.
రెడ్ కలర్ ను చాలా మంది ఇష్టపబడతారు. జ్యోతిష్యంప్రకారం.. ఎరుపు రంగు డబ్బును ఆకర్శిస్తుంది. ఈ పర్సును వాడేవారికి డబ్బులోటు ఉండదంటారు.
గోధుమ రంగు పరస్సును ఎక్కువగా మగవారే ఉపయోగిస్తారు. ఈ కలర్ పర్సును వాడే వారు ఖర్చులను తగ్గించి డబ్బును బాగా ఆదా చేస్తారట.
ఆడవాళ్లకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకే వీళ్లు ఈ కలర్ పర్సును ఎక్కువగా వాడతారు. అయితే ఈ కలర్ పర్సులు డబ్బును బాగా ఆదా చేస్తాయట. అలాగే మనకు అదృష్టాన్ని కలిగిస్తాయని నమ్ముతారు.
బ్లాక్ కలర్ ను కూడా చాలా మంది ఇష్టపడతారు. కానీ ఈ కలర్ పర్సులను వాడకూడదంటారు జ్యోతిష్యులు. ఎందుకంటే ఈ పర్సు డబ్బు ఖర్చయ్యేలా చేస్తుంది.
బంగారు రంగు పర్సు మీ సంపదను పెరగడానికి దోహదపడుతుంది. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులు వచ్చేలా చేస్తుంది.
నీలిరంగు కూడా చాలా మంచిది. ఈ కలర్ పర్సులు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. అలాగే మీకు డబ్బు కొరత రాకుండా చూస్తాయంటున్నారు జ్యోతిష్యులు.