Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల జిల్లాలో పాతకక్షలతో కత్తితో దాడి: ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి మండలంల వేంపేటలో రఘుసుందర్ అనే వ్యక్తి  పాతకక్షలతో తండ్రీ కొడుకులపై కత్తితో దాడి చేశాడు.ఈ ఘటనలో తండ్రి మరణించాడు. 

Raghusunder Attacked On Rajam Family in Jagtial district,
Author
First Published Sep 14, 2022, 10:25 AM IST

మెట్‌పల్లి: జగిత్యాల జిల్లాలోని  మెట్‌పల్లి మండలం వేంపేటలో పాత కక్షలతో తండ్రీ కొడుకులపై రఘుసుందర్ అనే వ్యక్తి కత్తితో దాడికి దిగాడు.ఈ ఘటనలో  చిన్నరాజం మృతి చెందగా అతను కొడుకు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన  వ్యక్తిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మరో వైపు రాజంపై కత్తితో దాడి చేసిన రఘుసుందర్ పై రాజం బంధువులు దాడి చేశారు. దీంతో రఘుసుందర్  కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ణి కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios