ధోనీ లా ఒకరోజు గడపాలని ఉంది.. పాక్ మహిళా క్రికెటర్ సనామీర్
సనామీర్.. ఇటీవల వాయిస్ ఆఫ్ క్రికెట్ షో కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. ఆ షోలో క్రికెట్ గురించి పలు విషయాలను ఆమె వెల్లడించారు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. తన అభిమాన ఇండియన్ క్రికెటర్ అని పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనామీర్ తెలిపారు. సనామీర్.. ఇటీవల వాయిస్ ఆఫ్ క్రికెట్ షో కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. ఆ షోలో క్రికెట్ గురించి పలు విషయాలను ఆమె వెల్లడించారు.
దీనిలో భాగంగానే యాంకర్.. సనామీర్ ని రాబిట్ ఫైర్ లో కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానంగా ధోనీ తన ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్ అని తెలిపింది. ‘‘ఒకరోజంతా నువ్వు ఏ క్రికెటర్ లా అయినా ఉండాలనుకంటే ఎవరిలా ఉంటావు ’’ యాంకర్ ప్నశ్నించగా.. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పేర్లను ఆమె తెలిపారు.