Asianet News TeluguAsianet News Telugu

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్

ఈబీసీ బిల్లుపై గురువారం నాడు  యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంధ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

youth for equality files petition against ebc reservations
Author
New Delhi, First Published Jan 10, 2019, 3:17 PM IST


న్యూఢిల్లీ: ఈబీసీ బిల్లుపై గురువారం నాడు  యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంధ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ విరుద్దమని ఆ సంస్థ ఆ పిటిషన్‌లో అభిప్రాయపడింది.  1992 లో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా ఈబీసీలకు రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది.

రాజ్యాంగంలోని 124 సవరణ ద్వారా ఈబీసీలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని ఈ సంస్థ తప్పుబట్టింది. రాజ్యాంగ సవరణ చేపట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టింది. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా  కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలోనే ప్రకటించారు.

ఒకవేళ ఈ పిల్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకొంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios