పాక్ విమానాన్ని కూల్చేసిన ఎయిర్ఫోర్స్: తప్పించుకున్న పైలట్
సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ సైన్యం భారత్పై ఊగిపోతోంది. ఏదో ఒకటి చేసే వరకు ఆ దేశ సైన్యానికి నిద్ర పట్టేలా కనిపించడం లేదు. దీంతో బుధవారం ఉదయం పాక్ వైమానిక దళానికి చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.
సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ సైన్యం భారత్పై ఊగిపోతోంది. ఏదో ఒకటి చేసే వరకు ఆ దేశ సైన్యానికి నిద్ర పట్టేలా కనిపించడం లేదు. దీంతో బుధవారం ఉదయం పాక్ వైమానిక దళానికి చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.
నియంత్రణ రేఖను దాటి సుమారు 3 కిలోమీటర్లు చొచ్చుకువచ్చాయి. పాక్ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ముందే ఊహించిన ఎయిర్ఫోర్స్ వాటిని వెంటాడాయి. ఈ క్రమంలో లాంబ్ వ్యాలీలో పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేశాయి.
భారత గగనతలంలోకి ప్రవేశించినందునే ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రకటించింది. పాక్కు చెందిన పైలట్ ప్యారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి తప్పించుకుని పారిపోయినట్లు సైన్యం తెలిపింది.
Pakistan Air Force's F-16 that violated Indian air space shot down in Indian retaliatory fire 3KM within Pakistan territory in Lam valley, Nowshera sector. pic.twitter.com/8emKMVpWKi
— ANI (@ANI) February 27, 2019