Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్: 13 మందితో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం అదృశ్యం

జోర్ హట్ నుండి బయలుదేరిన  ఐఎ ఎఫ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు లేకుండాపోయింది.
 

iaf plane goes missing
Author
New Delhi, First Published Jun 3, 2019, 3:54 PM IST


న్యూఢిల్లీ: జోర్ హట్ నుండి బయలుదేరిన  ఐఎ ఎఫ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు లేకుండాపోయింది.

టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ విమానం అదృశ్యమైంది. ఈ విమానంలో 8 మంది  సిబ్బంది ఉన్నారు. ఎఏన్-32 విమానంలో 8 మంది సిబ్బందితో పాటు 13 మంది ప్రయాణీకులు ఉన్నారు. చివరిసారిగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఏటీసీతో సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు టేకాఫ్ అయింది. 

ఐఎఎఫ్  ఎఎన్ -32  విమానం 2016లో అదృశ్యమైంది. ఆ సమయంలో విమానంలో 29 మంది  చెన్నై నుండి బయలుదేరిన విమానం అదృశ్యమైంది.జూలైలో ఈ విమానం అదృశ్యమైనా కూడ దాని ఆచూకీ కోసం అదే ఏడాది సెప్టెంబర్ వరకు వెతికారు. అయినా కూడ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సెప్టెంబర్ మాసంలో వెతకడం నిలిపివేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios