Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్‌లో లోయలో పడిన కారు: 10 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో  10 మంది మృతి చెందారు.

10 killed after vehicle falls into gorge on Jammu-Kashmir national highway in Ramban lns
Author
First Published Mar 29, 2024, 10:56 AM IST

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని  జమ్మూ-శ్రీనగర్  జాతీయ రహదారిపై  శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  10 మంది మృతి చెందారు. రంబాన్ జిల్లాలోని బ్యాటరీ చష్మా ప్రాంతంలో లోయలో కారు పడిపోయింది. శ్రీనగర్ నుండి జమ్మూకు వెళ్తున్న  సమయంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున  01:15 గంటల సమయంలో  300 అడుగుల లోతులోని లోయలో  కారు పడిపోయింది.ఈ ఘటనలో కారులో ప్రయాణీస్తున్న  10 మంది మృతి చెందారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన  ప్రాంతంలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి.  వర్షం కురుస్తున్నా  ప్రమాద స్థలం నుండి  10 మృతదేహలను కారు నుండి వెలికి తీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios