Asianet News TeluguAsianet News Telugu

సైనిక స్కూల్స్ లో ప్రేవేశాలు.. నవంబర్ 19 ధరఖాస్తుల చివరి తేదీ...

 అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన (ఆదివారం) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.  

sainik schools entrance test for class 6th and 9th  last date november 19
Author
Hyderabad, First Published Nov 7, 2020, 6:17 PM IST

ఢిల్లీ : సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2021 (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన (ఆదివారం) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లోకి ఏఐఎస్‌ఎస్‌ఈఈ ద్వారా ప్రవేశాలు ఉంటాయి. గత నెల 20వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో ముగుస్తుంది.

అధికారిక వెబ్ సైట్ https://aissee.nta.nic.inలో వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థులు దరఖాస్తును పంపాలి. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ www.nta.ac.inలోనూ దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూడవచ్చు.

2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓబీసీ-ఎన్‌సీఎల్‌ కేటగిరీ కింద కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు. మొత్తం 33 సైనిక పాఠశాలల్లో ఆరవ తరగతిలోకి బాలికలకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios