బయటపడ్డ అనసూయ సీరియస్ ఎఫైర్... ఎవరితోనో తెలుసా? అంత ఇష్టమా!
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తన సీరియస్ ఎఫైర్ గురించి ఓపెన్ అయ్యింది. తన ఇష్టాన్ని అభిమానులకు తెలియజేసింది.
Anasuya Bharadwaj
నటిగా అనసూయ ఫుల్ బిజీ. ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టాలీవుడ్ మేకర్స్ అనసూయకు విలక్షణ పాత్రలు ఆఫర్ చేస్తున్నారు. గత ఏడాది అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో విధమైన పాత్ర చేసింది.
నెక్స్ట్ అనసూయ పుష్ప 2లో దాక్షాయణిగా అలరించనుంది. లేడీ విలన్ గా డీగ్లామర్ గెటప్ లో అనసూయ ఫ్యాన్స్ ని ఫిదా చేయనుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
అలాగే మరికొన్ని చిత్రాలలో ఆమె నటిస్తున్నారు. అనసూయ బుల్లితెరకు దూరం కాగా ఫ్యాన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వారికి అందుబాటులో ఉంటుంది అనసూయ. ఎప్పటికప్పుడు వ్యక్తిగతమైన, వృత్తి పరమైన విషయాలు షేర్ చేస్తుంది.
anasuya instagram
తాజాగా సీరియస్ ఎఫైర్ అంటూ అనసూయ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అనసూయ సీరియస్ ఎఫైర్ పెట్టుకుంది మామిడి పళ్లతో . సమ్మర్ కావడంతో అందరికీ ఇష్టమైన మామిడి పళ్ళు వచ్చేశాయి. ఇక అనసూయ ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టు కాయలు కసాయి.
Anasuya Bharadwaj
అనసూయ, తన ఇద్దరు కొడుకులు ఓ వ్యక్తితో మామిడి కాయలు కోయించారు. ఇక వాటిని చూపిస్తూ అనస్య... మామిడి కాయల వేట. ఇది ఒక సీరియస్ ఎఫైర్, అని కామెంట్ జోడించింది. మామిడి పళ్ళు అంటే తనకు చాలా ఇష్టం. వాటితో అనుబంధం అలాంటిదని ఆమె వెల్లడించారు.
పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి కాయలు అంటే ఇష్టపడని వారు ఎవరు చెప్పండి? అదన్న మాట మేటర్. అనసూయ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ తమ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Anasuya Bharadwaj
జబర్దస్త్ వేదికగా అనసూయ పాపులారిటీ తెచ్చుకుంది. గ్లామరస్ యాంకర్ గా అనసూయ ఓ ట్రెండ్ సెట్టర్. 2022లో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ పూర్తి స్థాయి నటిగా కొనసాగుతుంది. బుల్లితెరకు దూరం కావడానికి ఆమె కొన్ని కారణాలు వివరించారు.