Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి సినిమాకి కనీస ఓపెనింగ్స్ రాలేదు.. అందుకే పవన్‌ కళ్యాణ్‌కి ఐదు కోట్లు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ రావడం లేదని, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు చూస్తేనే ఓపెనింగ్స్ వస్తాయని వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

ycp mla sensational comments on megastar chiranjeevi and pawan kalyan arj
Author
First Published Apr 22, 2024, 5:56 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి.. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి ఇటీవల ఐదు కోట్ల విరాళం అందించారు. తాను నటిస్తున్న `విశ్వంభర` మూవీ షూటింగ్‌ సెట్‌కి పవన్‌ని పిలిపించుకుని ఈ విరాళం అందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు చిరంజీవి, ఇటు పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ, చిరంజీవి సినిమాకి కనీసం ఓపెనింగ్స్ రావడం లేదంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 

చిరంజీవి సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు చూడాలని, వాళ్లు చూడటం కోసం పవన్‌కి చిరంజీవి విరాళం ఇచ్చాడని, చిరంజీవి పక్కా కమర్షియల్‌ అని సంచలన ఆరోపణలు చేశాడు భీమవరం ఎమ్మెల్యే గ్రాంధీ శ్రీనివాస్‌. పవన్‌ కళ్యాణ్‌ బాయ్‌కాట్‌ చేయాలని చెబితే చిరంజీవి సినిమాని చూసే దిక్కే లేదని ఆయన వ్యాఖ్యానించడం దూమారం రేపుతుంది. 

ఆయన మాట్లాడుతూ, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి చిరంజీవి నమస్కారం పెడితే దాన్ని పవన్‌ తట్టుకోలేకపోతున్నాడని, చిరంజీవి సినిమాని బాయ్‌కాట్‌ చేయమని పిలిపునిస్తే ఆ తర్వాత రిలీజ్‌ అయిన చిరు మూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. తన సినిమా ఆడాలంటే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు వస్తేగానీ తన సినిమా ఆడదని చెప్పి, చిరంజీవి పక్క కమర్షియల్‌ అని మనందరికి తెలుసు. అందుకే ఆతర్వాత పవన్‌ కళ్యాణ్‌ని రెండు మాటలు పొగిడారు. మరో ఐదారు నెలల్లో చిరంజీవిది కొత్త సినిమా రిలీజ్‌ అవుతుంది. ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి, ఓపెనింగ్స్ రావాలంటే పవన్‌ కళ్యాణ్‌ ని కాకా పట్టుకోవాలని, మొన్న ఐదు కోట్లేదో విరాళం ఇచ్చాడు. ఇది వీళ్ల మనస్థత్వాలు` అంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రాంధీ శ్రీనివాస్‌. 

ప్రస్తుతం ఎమ్మెల్యే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో రచ్చ అవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌పై కామెంట్స్ చేస్తే అది రాజకీయం, కానీ ఆయన చిరంజీవిపై ఇలాంటి సంచలన ఆరోపణలు చేయడం, విమర్శలు గుప్పించడంతో మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాలని ఎవరు ఎంత ప్రయత్నించినా  మెగా ఫ్యామిలీ ఎప్పటికీ ఒక్కటే అని అంటున్నారు. సదరు ఎమ్మెల్యేని ఆడుకుంటున్నారు మెగా అభిమానులు. దీనికి వైసీపీ అభిమానులు కౌంటర్లిస్తుండటంతో పెద్ద రచ్చ అవుతుంది. 

ఇక ప్రస్తుతం మెగాస్టార్‌ `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. మరో ఐదుగురు హీరోయిన్లు మెరవబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది. సోషియో ఫాంటసీగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇక చిరంజీవి.. చివరగా `భోళా శంకర్‌` చిత్రంలో నటించారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అంతకుముందు `వాల్తేర్‌ వీరయ్య`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. అంతకు ముందు `ఆచార్య`తో మరో డిజాస్టర్‌ చవిచూశారు చిరు. ఈ సినిమాని ఉద్దేశించే తాజాగా ఎమ్మెల్యే కామెంట్స్ చేయడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios