Gangs of Godavari : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సాలిడ్ అప్డేట్.. గట్టిగా ప్లాన్ చేసిన విశ్వక్ సేన్.. ఏంటంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) సాలిడ్ అప్డేట్ అందించారు. తన నెక్ట్స్ సినిమా విడుదల ప్రమోషన్స్ ను చాలా గట్టిగా ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చివరిగా ‘గామీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగానే విశ్వక్ సేన్ తన నెక్ట్స్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా అయ్యారు. విశ్వక్ సేన్ కెరీర్ లో చాలా హోప్స్ తో వస్తున్న చిత్రం కావడంతో మరింత శ్రద్ధ వహిస్తున్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
విశ్వక్ సేన్ నుంచి ఊరమాస్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న చిత్రమే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). ఈ చిత్రం ఎప్పుడో పూర్తైంది. రిలీజ్ విషయంలో అడ్డంకులు ఏర్పడి వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్, ఫిబ్రవరి అంటూ వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేళలకు మే17 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ సినిమాను ఇప్పటి నుంచే గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సినిమా నుంచి తాజాగా సాలిడ్ అప్డేట్ ను అందించారు. మూవీ నుంచి మరో బ్లాక్ బాస్టర్ సాంగ్ ను లాంచ్ చేయబోతున్నామని తెలిపారు. ఈసారి ‘మోత’ (Motha) అనే మాస్ సాంగ్ ను లాంచ్ చేస్తున్నామని తెలిపారు. ఈసాంగ్ విడుదల సందర్భంగా సికింద్రాబాద్ లోని మారెడ్ పల్లి జేబీఎస్ కంటోన్మెంట్ పార్క్ లో ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
మార్చి 25న ఈ సాంగ్ ను ఉదయం 11 : 11 నిమిషాలకు విడుదల చేస్తున్నామన్నారు. ఈ పాటకు అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ లిరిక్స్ అందించడం విశేషమన్నారు. ఇక యువన్ శంకర్ రాజా అదిరిపోయే బీట్ అందించారని, ఈవెంట్ ను సక్సెస్ చేయాలని కోరారు. చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకుడు. అంజలి కీలక పాత్రలో మెరవబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.