'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' టీజర్.. ఇంటరెస్టింగ్ గా ఉందే!
ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు అడివి సాయికిరణ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'.
ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు అడివి సాయికిరణ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఈ సినిమాలో తీవ్రవాది 'ఘాజీబాబా' పాత్రలో ప్రముఖ రచయిత అబ్బూరి రవి నటించారు.
తాజాగా ఈ సినిమా టీజర్ ని హీరో మహేష్ బాబు విడుదల చేశారు. నలుగురు స్నేహితులు, ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథగా టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది. టీజర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు.
ఈ సినిమాలో 'ఎయిర్ టెల్' మోడల్ శషా చెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక పాత్రధారులుగా నటించారు. ఈ ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.