Asianet News TeluguAsianet News Telugu

సుకుమార్ నిర్మాతగా నాగచైతన్య చిత్రం...డైరక్టర్ దమ్మున్నోడే

 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. నాగచైతన్య మొన్న దూత చేసిన తర్వాత మరోసారి ఇలాంటి సూపర్ నాచురల్ థ్రిల్లర్ చేస్తున్నారు. 
 

Naga Chaitanya to team up with Virupaksha director? jsp
Author
First Published Mar 22, 2024, 8:33 AM IST

 సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టిక‌ల్‌ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా  కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. అయితే ఆ తర్వాత ఆ దర్శకుడు నుంచి నెక్ట్స్ ప్రాజెక్టు ప్రకటన అయితే రాలేదు. కానీ హీరో ఖరారు అయ్యారని ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని తెలుస్తోంది. 

విరూపాక్ష దర్శకుడుతో చేయబోయే ఆ హీరో మరెవరో కాదు నాగచైతన్య. ఈ సారి నాగచైతన్య ని మరో మిస్టికల్ థ్రిల్లర్ లో చూపబోతున్నారు.  విరూపాక్షతో తనను తాను ప్రూవ్‌ చేసుకున్న దర్శకుడు కార్తీక్‌ దండు పై అందరి హీరోల దృష్టీ పడినా ఇలాంటి మిస్టికల్ థ్రిల్లల్ లో నటించటానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో అక్కినేని కుటుంబం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి.  ఈ సినిమాని సుకుమార్,  నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు.  సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ తో నడిచే సినిమా అంటున్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. నాగచైతన్య మొన్న దూత చేసిన తర్వాత మరోసారి ఇలాంటి సూపర్ నాచురల్ థ్రిల్లర్ చేస్తున్నారు. 
 
మరో ప్రక్క  చైతూ నటించిన ధూత ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో గతేడాది డిసెంబర్‌ 1న విడుదలై సాలిడ్ వ్యూయర్‌ షిప్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం ధూత సీక్వెల్‌ రెడీ అవుతోంది.  సూప‌ర్ నేచుర‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వచ్చిన ఈ అమెజాన్‌ ఒరిజినల్ సీరీస్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. చూసిన వారికి సీక్వెల్‌ ఉంటే బావుండు అన్నట్టుగా ఈ సీరీస్‌ ను తీర్చిదిద్ధారు.

Follow Us:
Download App:
  • android
  • ios