బాలీవుడ్ లో 'ఇస్మార్ట్ శంకర్'.. హీరో ఎవరో తెలుసా..?
పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాను రణ్వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. చాలా కాలం తరువాత ఈ సినిమాతో పూరి మాసివ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
రీసెంట్ గా సినిమా కారణంగా వచ్చిన ప్రాఫిట్స్ తో లగ్జరీ కార్లు కూడా కొన్నాడు పూరి. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను బాలీవుడ్ లో బాగానే రీమేక్ చేస్తున్నారు.
తెలుగు సినిమాలకు క్రేజ్ పెరగడంతో నార్త్ వారి చూపు కూడా ఇటువైపు పడింది. ఇక్కడ హిట్ అయిన సినిమాలను తమ దగ్గర రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'ఇస్మార్ట్ శంకర్'ని బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా సొంతం చేసుకున్న ఈ సంస్థ త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్నట్లుగా సమాచారం.
అయితే బాలీవుడ్ లో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. తెలుగులో అయితే పూరి ఈ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్లు చెప్పాడు.