`ఓజీ`లో ఇమ్రాన్ హష్మీ పాత్ర ఇదే.. వామ్మో అతిభయంకరమైన విలన్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న `ఓజీ` మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇమ్రాన్ హష్మి బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఆయన పాత్రని రివీల్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో `ఓజీ`. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం మూవీ షూటింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండటంతో షూటింగ్కి గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ మూవీ నుంచి మాత్రం తరచూ అప్డేట్లు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుంది యూనిట్. రిలీజ్ డేట్, ఇటీవల కొత్త పోస్టర్లతో సందడి చేశారు. అవి ఆకట్టుకున్నాయి. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది యూనిట్. ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మి ఫస్ట్ లుక్ విడుదల చేసింది. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ఇమ్రాన్ పాత్రని రివీల్ చేసింది.
Survey:వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
ఇమ్రాన్ హష్మి `ఓజీ`లో విలన్ రోల్ చేస్తున్నారు. అయితే ఆయన అత్యంత భయంకరమైన విలన్గా పరిచయం చేశారు మేకర్స్. ఆయన ఓమీ భావు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆయన సిగరేట్ తాగుతూ, పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నాడు ఇమ్రాన్ హష్మి. బాలీవుడ్లో కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరుతెచ్చుకున్నాడు ఇమ్రాన్. ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఓ క్రూరమైన విలన్గా ఆకట్టుకోబోతున్నారు.
గెటప్ వైజ్గా పవన్ కళ్యాణ్ గెటప్నే తలపిస్తుంది. బ్లాక్ డ్రెస్, చేతికి కడియం, హెయిర్ స్టయిల్ ఇలా అన్నీ పవన్ గెటప్కి దగ్గరగా ఉంది. అయితే ఈ సినిమా గ్యాంగ్స్టర్(మాఫియా) ప్రధానంగా సాగుతుంది. చీకటి సామ్రాజ్యానికి అధిపతులుగా ఓ వైపు పవన్, మరోవైపు ఇమ్రాన్ కనిపిస్తారట. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతుందని, తమ మహిళలను విలన్ టచ్ చేయడంతో వారితో పవన్ పోరాడుతాడని, వారిని అంతం చేయడం కోసం మళ్లీ రంగంలోకి దిగుతాడని తెలుస్తుంది.
ఇక `ఓజీ`లో పవన్ పాత్ర మూడు భిన్నమైన షేడ్స్ లో ఉంటుందని ఇటీవల `రజాకార్` నటుడు తేజ సప్రూ వెల్లడించారు. యూనియన్ లీడర్గా, డాన్ గా, పొలిటికల్ లీడర్ పాత్రలోనూ పవన్ కనిపిస్తారని తెలిపాడు. సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని తెలిపారు. ఇమ్రాన్ హష్మికి ఆయన తండ్రి పాత్రలో కనిపిస్తారట. తనది కూడా విలన్ రోలే అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇందులో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మితోపాటు అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మించే ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది.