Asianet News TeluguAsianet News Telugu

ప్రసాద్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్ కి సతీ వియోగం!

శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించారు. హార్ట్ ఎటాక్ కారణంగా రాత్రి నిద్రలో తుదిశ్వాస విడిచారు. 

Prasad Group's Chairman Ramesh Prasad's wife passes away
Author
Hyderabad, First Published Oct 17, 2019, 4:38 PM IST

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ గారి సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించారు. హార్ట్ ఎటాక్ కారణంగా రాత్రి నిద్రలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు.

ఆమె మద్రాసులో జన్మించారు. రమేష్ ప్రసాద్ గారితో 1963 జూలైలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

రమేష్ ప్రసాద్ వ్యాపారవేత్తగా, సినిమా నిర్మాతగా పేరు గాంచారు. ఆయన ప్రసాద్ స్టుడియోస్,  ప్రసాద్ ఐమాక్స్ మరియు ఎల్ వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్లకు చైర్మన్ మరియు అధిపతి. ఆయన 1988-89 కాలంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు అధ్యక్షునిగా ఉన్నారు. 

Prasad Group's Chairman Ramesh Prasad's wife passes away

Follow Us:
Download App:
  • android
  • ios