'పుష్ప3’...స్పైడర్ మ్యాన్ తరహాలో అదిరిపోయే ప్లానింగ్?
ప్రాధమికంగా బన్నీ, సుక్కు, మైత్రి అధినేతలు ఈ ప్రాజెక్టుపై ఓ మాట అనుకున్నట్లు చెప్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం రెండు భాగాలతో ఆగేలా లేదు. ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న సెకండ్ పార్ట్ తర్వాత చివరి పార్ట్ తో ఈ సినిమా కథని కంప్లీట్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా బన్నీ, సుక్కు, మైత్రి అధినేతలు ఈ ప్రాజెక్టుపై ఓ మాట అనుకున్నట్లు చెప్తున్నారు. మరి మూడో పార్ట్ కు ఏ టైటిల్ పెట్టబోతున్నారు?
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సీక్వెల్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కథ మూడో పార్ట్కు (Pushpa 3) సంబంధించిన వార్త వైరల్గా మారింది. దీనికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం బన్నీ, సుకుమార్లు మూడో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై చర్చలు కూడా జరిపారట. మొదటి భాగాన్ని ‘పుష్ప: ది రైజ్’తో ప్రారంభించిన చిత్రబృందం దానికి సీక్వెల్గా ‘పుష్ప: ది రూల్’ను రూపొందిస్తున్నారు. దాని తర్వాత ‘పుష్ప: ది రోర్’ పేరుతో పార్ట్3 తెరకెక్కించి కథను ముగించనున్నారట. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ తరహాలో పుష్పని ఒక పవర్ ఫుల్ బ్రాండ్ గా మార్చేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారంటున్నారు.
రీసెంట్ గా ఈ పార్ట్3పై అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. అన్నీ అనుకూలంగా ఉంటే పార్ట్3 తీసే అవకాశాలున్నాయన్నారు. కథను కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనిని తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలున్నాయని.. ఇందులో పాత్రల మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటుందన్నారు. బన్నీ ఈ విషయాలను చెప్పినప్పటి నుంచి మూడో భాగానికి సంబంధించిన వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ‘పుష్ప2’ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న విడుదల కానుంది.