Asianet News TeluguAsianet News Telugu

హోలీ తరువాత స్టాక్ మార్కెట్ పతనం; సెన్సెక్స్ 361 పాయింట్లు డౌన్, అదే బాటలో నిఫ్టీ..

మరోవైపు హోలీ పండుగ సెలవు తర్వాత రోజు అంటే ఇవాళ  స్టాక్ మార్కెట్‌కు ట్రేడింగ్ క్షీణతతో ప్రారంభమైంది. మంగళవారం మార్కెట్ ప్రారంభంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 468 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. 

Share Market: After Holi holiday stock market boomed; Sensex fell 361 points, Nifty also slipped-sak
Author
First Published Mar 26, 2024, 7:37 PM IST

రంగుల పండుగ హోలీ పండుగ తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. నేడు మంగళవారం సెన్సెక్స్ 361.64 పాయింట్లు పడిపోయి 72,470.30 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 92.05 పాయింట్లు నష్టపోయి 22,004.70 వద్ద ముగిసింది. 

స్టాక్ మార్కెట్ కదలికలు ఇలా :

*స్థానిక స్టాక్ మార్కెట్లలో మూడు ట్రేడింగ్ సెషన్ల పాటు కొనసాగిన బుల్లిష్ ట్రెండ్ కు మంగళవారం బ్రేక్ పడింది. ఈ సమయంలో, బిఎస్ఇ సెన్సెక్స్ 361 పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.

*గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి మధ్య, ఇండెక్స్‌లో బలమైన వాటా  ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇంకా ఐటి స్టాక్‌లలో అమ్మకాల కారణంగా మార్కెట్ పడిపోయింది. 

*బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆధారిత 30 షేర్లు 0.50 శాతం పతనంతో ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో ఒక్కసారిగా 468.91 పాయింట్లకు పడిపోయింది.

*సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 నష్టాల్లో ఉండగా, 10 లాభాల్లో ఉన్నాయి.

*50 షేర్ల ఆధారంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 0.42 శాతం క్షీణతతో ముగిసింది.

*30 నిఫ్టీ షేర్లు నష్టాల్లో, 20 లాభాల్లో ఉన్నాయి.

*ఆసియాలోని ఇతర మార్కెట్లలో జపాన్‌కు చెందిన నిక్కీ నష్టపోగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ లాభాల్లో ఉన్నాయి.

మరోవైపు హోలీ పండుగ సెలవు తర్వాత రోజు అంటే ఇవాళ  స్టాక్ మార్కెట్‌కు ట్రేడింగ్ క్షీణతతో ప్రారంభమైంది. మంగళవారం మార్కెట్ ప్రారంభంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 468 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. దీంతో సెన్సెక్స్ 72,363కి చేరింది. నిఫ్టీ కూడా 149 పాయింట్లు పతనమై 21,947కు చేరుకుంది. 

సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీల్లో పవర్‌గ్రిడ్, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ అలాగే టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో జపాన్‌కు చెందిన నిక్కీ, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ నష్టాల్లో ఉండగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ లాభాల్లో ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) గత శుక్రవారం రూ.3,309.76 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.01 శాతం తగ్గి US $ 86.74కి చేరుకుంది.

 మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో భారతీయ రూపాయి తన ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుండి కోలుకుని 29 పైసలు పెరిగి 83.32 వద్దకు చేరుకుంది.

ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలర్‌కు 83.33 వద్ద ప్రారంభమైంది.  ఇది గత ముగింపు స్థాయి కంటే 29 పైసలు పెరిగింది. శుక్రవారం డాలర్‌తో రూపాయి 48 పైసలు పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది.  ఆరు ప్రధాన కరెన్సీలతో US డాలర్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.01 శాతం తగ్గి 103.79 వద్ద ట్రేడైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios