Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ Q4 ఫలితాలు: లాభాల రికార్డు.. 13 శాతం పెరిగి రూ. 5,337 కోట్లకు చేరుకున్న లాభాలు..

రిలయన్స్ జియో Q4 ఫలితాలు: టెలికాం క్యారియర్ నికర లాభం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 4,716 కోట్ల నుంచి రూ. 5,337 కోట్లకు చేరుకుందని పేర్కొంది.

Reliance Jio Q4 results: Profit jumps over 13% to Rs 5,337 crore-sak
Author
First Published Apr 22, 2024, 8:38 PM IST

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చి 31, 2024తో ముగిసే త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, కంపెనీ నికర లాభం నాలుగో త్రైమాసికంలో దాదాపు స్థిరంగా రూ.18,951 కోట్లుగా ఉంది. అదే సమయంలో, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వార్షిక లాభాల రికార్డు రూ.69,621 కోట్లు.

జియో ప్లాట్‌ఫారమ్‌ల లాభం రూ. 20,000 కోట్లు
రిలయన్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, కంపెనీ అన్యువల్  ఆదాయం 2.6% పెరిగి రూ.1,000,122 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ EBITDA అన్యువల్ ప్రాతిపదికన 16.1% పెరిగి రూ.1,78,677 కోట్లకు చేరుకుంది. కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, జియో ప్లాట్‌ఫారమ్‌ల నికర లాభం రూ. 20,000 కోట్లు దాటింది. అదే సమయంలో రిలయన్స్ రిటైల్ నికర లాభం కూడా రూ.10,000 కోట్లను దాటింది. నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటనతో పాటు ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.

వాటాదారుల ఆమోదం తర్వాత డివిడెండ్ పేమెంట్  తేదీ ప్రకటిన.. 
సరైన సమయంలో డివిడెండ్ పేమెంట్ తేదీని ప్రకటిస్తామని స్టాక్ మార్కెట్‌కు పంపిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇప్పటికే ఒక్కో షేరుకు రూ.9 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ చెల్లింపు వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుందని కంపెనీ ఫైలింగ్‌లో తెలిపింది.

మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 11% పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంతో పోలిస్తే, ఈ ఏడాది మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండు శాతం క్షీణించి రూ.18,951 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.19,299 కోట్లుగా ఉంది. కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 11% పెరిగి రూ.2.4 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో  రూ.2.16 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ అన్యువల్  ప్రాతిపదికన EBITDAలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన 14% వృద్ధితో, మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో రూ.47,150 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో, EBITDA మార్జిన్ 50 బేసిస్ పాయింట్లు పెరిగి 17.8%కి చేరుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios