Asianet News TeluguAsianet News Telugu

లైంగిక దాడి కేసు: పూర్ణానంద స‌ర‌స్వ‌తికి పోటెన్సీ టెస్ట్.. కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన పోలీసులు

Sexual assault case: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో జ్ఞానానంద ఆశ్రమ పీఠాధిపతి పూర్ణానంద స్వామికి  పోటెన్సీ టెస్ట్ నిర్వహించాలన్న కోర్టు ఆదేశాల కోసం దిశ పోలీసులు ఎదురుచూస్తున్నారు. లైంగిక వేధింపుల క్ర‌మంలో ఆశ్రమం నుంచి తప్పించుకున్న మైనర్ బాలిక బోధకుడిపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు 2012లో తనపై నమోదైన మరో లైంగిక దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆశ్రమ పీఠాధిపతికి 14 రోజుల రిమాండ్ విధించారు.
 

Sexual assault case: Potency test for Purnananda Saraswati; Police revealed key facts RMA
Author
First Published Jun 24, 2023, 11:30 AM IST

Purnananda Saraswati-Sexual assault case: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో జ్ఞానానంద ఆశ్రమ పీఠాధిపతి పూర్ణానంద స్వామికి  పోటెన్సీ టెస్ట్ నిర్వహించాలన్న కోర్టు ఆదేశాల కోసం దిశ పోలీసులు ఎదురుచూస్తున్నారు. లైంగిక వేధింపుల క్ర‌మంలో ఆశ్రమం నుంచి తప్పించుకున్న మైనర్ బాలిక బోధకుడిపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు 2012లో తనపై నమోదైన మరో లైంగిక దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆశ్రమ పీఠాధిపతికి 14 రోజుల రిమాండ్ విధించారు.

వెంకోజీపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమం స్వామి తనపై లైంగిక దాడికి పాల్పడటంతో ఆశ్రమం నుంచి పారిపోయిన ఓ మైనర్ బాలిక ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పొటెన్సీ టెస్ట్, ఐడెంటిఫికేషన్ చేయ‌డం కోసం పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. 2012 నుంచి తనపై మరో లైంగిక దాడి కేసును ఎదుర్కొంటున్న స్వామికి ఇప్పటికే పొటెన్సీ టెస్ట్ రిపోర్టులు రావడం గమనార్హం. ఆ పరీక్షల ఫలితాలు స్వామి నపుంసకుడని సూచిస్తున్నాయి. అయితే, 2012లో పోక్సో చట్టం లేదని దర్యాప్తు అధికారి, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.వివేకానంద తెలిపినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ చట్టం ప్రకారం మైనర్ బాలికను తాకడం కూడా నేరమేనని, కేసు తీవ్రతను బట్టి 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తార‌ని తెలిపారు. 

దీనికి సంభోగం, ప్రవేశం అవసరం లేదు. మైనర్ల శరీర భాగాలను తాకడం కూడా నేరమేనని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందనీ, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కొన్ని ప్రక్రియల్లో ముందుకు నడుచుకుంటారని చెప్పారు. లైంగిక‌ సామర్థ్య పరీక్షలు నిర్వహించి నిందితులను గుర్తించాలన్న ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. బాధిత బాలిక విజయవాడలో ఉండగా పూర్ణానంద‌ స్వామి రిమాండ్ లో ఉన్నాడు.

కేసు పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

విజయవాడలో యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ వెంకోజీలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్ణానంద సరస్వతి తనను పలుమార్లు హింసించాడని, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తన‌పై జ‌రుగుతున్న ఈ దారుణం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక విజయవాడ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారనీ, రెండేళ్ల క్రితం అమ్మమ్మ ఆమెను ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్ణానంద సరస్వతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు అధికారి వివేకానంద తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకులు ఎవరూ లేకపోవడంతో ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకుని పూర్ణానంద సరస్వతి గత కొన్ని నెలలుగా ఆశ్రమంలోనే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంత‌కుముందు త్వరలోనే అతడిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా, పూర్ణానంద స‌రస్వ‌తిపై పలు కేసులు ఉన్నాయనీ, భూ వివాదాల్లో కూడా ప్రమేయం ఉందని పోలీసులు తెలిపిన‌ట్టు ఎన్డీటీవీ నివేదించింది. 9.5 ఎకరాల ఆశ్రమ భూమి కూడా వివాదంలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios