రెచ్చగొడుతున్నారు, ఊరుకోం: తిత్లీపై చంద్రబాబు ట్వీట్
తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు.
అమరావతి: తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. తుఫాన్ బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వం పని చేస్తోంటే ... సహాయక చర్యలను ఆటంకపర్చేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా విపక్షాల తీరును దుయ్యబట్టారు. ప్రభుత్వం పలాస వచ్చి తుఫాన్ బాధితులకు సహాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంటే... రోడ్లమీదకు రండి.. గొడవలు చేయడంటూ రెచ్చగొడుతున్నారని చంద్రబాబునాయుడు విపక్షాల తీరుపై మండిపడ్డారు.
ప్రభుత్వం అంతా పలాస వచ్చి రేయింబవళ్లు శ్రమిస్తుంటే, రోడ్ల మీదకు రండి, గొడవలు చేయండి అని కొందరు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. సహాయక చర్యలకు ఆటంకాలు కల్పిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. చేతనైతే మీరూ సాయం చేయండి. అంతేగాని రెచ్చగొట్టి అడ్డంకులు కల్పించకండి. #CycloneTitli pic.twitter.com/kbsQ89r27O
— N Chandrababu Naidu (@ncbn) October 17, 2018
సహాయకచర్యలకు ఆటంకాలు కల్పిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టి సహాయకచర్యలకు ఆటంకం కల్పించవద్దని బాబు సూచించారు.
#CycloneTitli has left many of the lives in devastation in the northern coastal regions of Andhra Pradesh. Join hands with Government of Andhra Pradesh in rebuilding their lives. Make a difference by contributing to the Chief Minister's Relief Fund & become a part of our efforts. pic.twitter.com/OMmCVANmEj
— N Chandrababu Naidu (@ncbn) October 14, 2018
తిత్లీ తుఫాన్ కారణంగా ఏపీలోని వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వంతో కలిసిరావాలని బాబు కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు ఇవ్వాల్సిందిగా ఆయన ట్వీట్ చేశారు.