వేసవిలో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి బియ్యం పిండి వాడితే చాలు.
వారంలో రెండు రోజులు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బియ్యం పిండితో వివిధ పదార్థాలను కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని రకాలను చూద్దాం.
బియ్యం పిండి, అవిసె గింజలు నానబెట్టిన నీటిని కలిపి ముఖానికి రాసి, 10 నిమిషాల తర్వాత మసాజ్ చేసి కడగాలి.
బియ్యం పిండి, తేనె సమానంగా కలిపి ముఖానికి రాసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. కడగడానికి ముందు మసాజ్ చేయండి.
బియ్యం పిండి, పెరుగు సమానంగా కలిపి ముఖానికి రాసి బాగా మసాజ్ చేయండి. కొంత సమయం తర్వాత కడగాలి.
బియ్యం పిండి, బ్రౌన్ షుగర్ రెండింటినీ కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి కొంత సమయం మసాజ్ చేసి కడగవచ్చు.
బియ్యం పిండి, కలబందను సమానంగా తీసుకుని ముఖానికి పూయండి. 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మం తేమగా ఉంటుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార నియంత్రణ అవసరం. వేసవిలో నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ తినడం మానుకోండి.
వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి ద్రవ పదార్థాలు తీసుకోండి. ఎక్కువ నీరు త్రాగండి.