Spiritual

దీపావళికి లక్ష్మీ పూజ చేసిన తర్వాత విగ్రహం ఏం చేయాలో తెలుసా?

అక్టోబర్ 31న దీపావళి

దీపావళి హిందూ పండుగ. ఈ సంవత్సరం ఈ పండుగ అక్టోబర్ 31, గురువారం నాడు జరుపుకుంటారు. దీపావళి రోజున ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తారు.

లక్ష్మీ విగ్రహంతో ఏం చేయాలి?

పూజ తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం లేదా ఉద్వాసన చెప్పడం చాలా అవసరం. ఇలా చేయకపోతే సత్ఫలితాలు రావని పండితులు చెబుతున్నారు.

దీపం తప్పనిసరి

దీపావళి పూజ తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని రాత్రిపూట శుద్ధమైన నెయ్యి దీపం వెలిగించాలి.

మరుసటి రోజు ఉద్వాసన

దీపావళి తర్వాత మరుసటి రోజు శుభ ముహూర్తంలో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించి కొంత సమయం తర్వాత విగ్రహాన్ని దాని స్థానం నుండి కొద్దిగా కదిలించాలి.

ఉత్తర భారత్ లో నిమజ్జనం

లక్ష్మీదేవి విగ్రహాన్ని నది, చెరువు లేదా బావిలో నిమజ్జనం చేయడం ఉత్తర భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమంగా చేస్తారు. 

విగ్రహాలను జాగ్రత్తగా చూసుకోండి

దక్షిణ భారత్ లో లక్ష్మీ విగ్రహాన్ని నిమజ్జనం చేయరు. పూజ అనంతరం ఉద్వాసన చెప్పి యధావిధిగా పూజా మందిరంలో ఉంచుతారు. అమ్మవారి అనుగ్రహం కోసం దుకాణాల్లో పెట్టుకుంటారు. 

Find Next One