Entertainment
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న 'సికందర్' సినిమా మార్చి 30న విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. రిలీజ్కి రెడీ అవుతున్న క్రమంలో అప్ డేట్ వచ్చింది.
సల్మాన్ ఖాన్ `సికందర్` సినిమాకు సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. మార్పులు సూచించింది. మార్పులు చేస్తేనే రిలీజ్ చేయాలని నిబంధన పెట్టింది.
'సికందర్' సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ కొన్ని చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది.
బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం, 'సికందర్' చిత్రంలోని 2 సీన్లలో చిన్న మార్పులు చేయమని చెప్పారు. హోం మినిస్టర్ బదులు మినిస్టర్ వాడాలి.
`సికందర్` సినిమాలో పొలిటికల్ పార్టీ హోర్డింగ్ను చూపించారు, దానిని బ్లర్ చేయమని చెప్పారు.
`సికందర్` సినిమాలోని ఏ సీన్ను కట్ చేయమని చెప్పలేదు. హోం మంత్రి బదులు మంత్రి అని, పార్టీ బ్యానర్ను బ్లర్ చేయాలి.